జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అంబటి రాంబాబు వ్యంగ్య వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయలేకపోయింది. బీజేపీ, ఎంఐఎం ధాటికి 56 డివిజన్లకే పరిమితమైంది. దీనిపై ఏపీ రాజకీయనాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చావుతప్పి కన్నులొట్టబోయిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, గ్రేటర్ లో టీడీపీ చచ్చిపోయిందని, కాంగ్రెస్ కొనఊపిరితో ఉందని వ్యాఖ్యానించారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కనీసం బోణీ కూడా కొట్టలేకపోగా, కాంగ్రెస్ కు 2 డివిజన్లు దక్కాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.

Ambati Rambabu
GHMC Elections
Results
TRS
Telugudesam
Congress
Hyderabad

More Telugu News